Movies

జాక్వెలైన్‌పై ఈడీ చార్జ్‌షీట్‌

జాక్వెలైన్‌పై ఈడీ చార్జ్‌షీట్‌

మనీ లాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌పై చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సిద్ధమవుతున్నది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్‌ కేసులో ఆమెకు పాత్ర ఉన్నట్లు ఈడీ గత కొద్ది నెలలుగా జరుపుతున్న దర్యాప్తులో తేల్చింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి జాక్వెలైన్‌కు చెందిన 15 లక్షల రూపాయల నగదు, 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఈడీ అటాచ్‌ చేసింది. తీహార్‌ జైలు నుంచి సాగిన ఈ హవాలాలో సుఖేష్‌ చంద్రశేఖర్‌ ప్రధాన పాత్రధారి కాగా..ఈ నాయిక కూడా నేరంలో ఇన్వాల్వ్‌ అయ్యిందని ఈడీ అంటున్నది. ఇప్పటికే పలు మార్లు ఆమెను విచారించింది. చివరిసారిగా జూన్‌లో ప్రశ్నించి వివరాలు రాబట్టారు అధికారులు.తాజాగా ఈ కేసులో జాక్వెలైన్‌పై ఈడీ చార్జ్‌ షీట్‌ నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీలంక జాతీయురాలైన ఈ తార బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి పలు హిట్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.