Business

ఇండియా భవిత ప్రైవేట్ రంగంలోనే ఉంది:Maruti Chairman

ఇండియా భవిత ప్రైవేట్ రంగంలోనే ఉంది:Maruti Chairman

దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే భారత్‌ ముందున్న మార్గం ప్రైవేటు రంగంపై ఆధారపడడమేనని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంపై విశ్వాసం ఉంచిందని, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన విషయంలో ప్రైవేటును ప్రోత్సహిస్తోందని చెప్పారు. మారుతీ సుజుకీ స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.