Politics

నన్ను ఇరికించారు

నన్ను ఇరికించారు

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్‌ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ నమోదుచేసిన కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌కు తోడల్లుడిని అయినందునే నిందితుడిగా చేర్చారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారించారు.