మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అమెరికాలో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనున్నట్లు చెప్పారు.
అంతకుముందు అనివార్య కారణాల వల్ల ఈ అవార్డును అందుకునేందుకు సత్యనాదెళ్ల భారత్కు రాలేకపోయారు.
పద్మభూషణ్ పురస్కారాన్ని శాన్ ఫ్రాన్సిస్కో లో భారత కాన్సులేట్ జనరల్ టీ నాగేంద్రప్రసాద్ సత్య నాదెళ్లకు ప్రభుత్వం తరఫున అందజేశారు