NRI-NRT

USA NRI తెలుగుదేశం మహిళా కార్యవర్గం నియామకం

USA NRI తెలుగుదేశం మహిళా కార్యవర్గం నియామకం

ఎన్నారై టీడీపీ యూఎస్ఏ శాఖ మహిళా విభాగానికి కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కొత్త సభ్యులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీకి ప్రెసిడెంట్‌గా శివానీ జాగర్లమూడి ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా లక్ష్మి రాయపాటి, జనరల్ సెక్రెటరీగా కృష్ణ ప్రియ అడుసుమల్లి, కోశాధికారిగా రామ్ కొండపల్లి, రీజినల్ కోర్డినేటర్‌గా సాయి సుధ పాలడుగు, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా సారూప్య భాష్యం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మనుకొండ సుష్మ, గుంటు కృష్ణ చరిత నియమితులయ్యారు.
1-a44d223521-V-jpg-799x414-4g