Movies

కళ్యాణం..కమనీయం

Auto Draft

టాలీవుడ్‌ యువ హీరో నాగశౌర్య వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త అనూష శెట్టితో ఆయన పెండ్లి వేడుకలు ఆదివారం బెంగుళూరులోని ఓ స్టార్‌ హోటల్లో జరిగాయి. బంధుమిత్రులు, సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి కొందరు సహ కథానాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. శనివారం నుంచే వీరి వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. మెహందీ, కాక్‌ టెయిల్‌ పార్టీలు నిర్వహించారు. కొత్త దంపతులు నాగశౌర్య, అనూషకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పోలీసు వారి హెచ్చరిక’ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు.