కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారని, ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారు.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని నారా లోకేష్ అన్నారు.
దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.
ఇప్పుడు మంత్రి కాకాణీకి సిబిఐ ‘రా’ అని పిలుస్తోందన్నారు.
రాష్ట్రంలో పరిపాలన దరిద్రంగా ఉందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు.
సైకో పరిపాలను తరిమికొట్టాలంటే కలిసికట్టుగా పోరాడుదామని పిలుపిచ్చారు.
సైకోరాజ్యంలో దుబారా ఖర్చులు పెరిగి రైతులపై భారం పడిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.