Devotional

తిరుమల..లాహిరి.. లాహిరి… లాహిరి…లో

తిరుమల..లాహిరి.. లాహిరి… లాహిరి…లో

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండ్రోజులపాటు శ్రీరామ, శ్రీకృష్ణుడి రూపాల్లో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు మూడో రోజైన ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా కనువిందు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం పుష్కరిణిలో తెప్పపై కొలువుదీర్చారు. విద్యుద్దీపాల వెలుగులు, వేదం, నాదం, గోవింద నామస్మరణల మధ్య తెప్పపై పుష్కరిణిలో శ్రీవారు విహరిస్తూ.. భక్తులను కటాక్షించారు.