NRI-NRT

ఖతర్ లో తెలంగాణ ప్రజా సమితి అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

ఖతర్ లో తెలంగాణ ప్రజా సమితి అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

పిట్ట కొంచెం కూత ఘనం.. గల్ఫ్ లోని చిన్న దేశాలలో ఒకటయిన ఖతర్ భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాల విషయాలలో మాత్రం ఇతర పెద్ద దేశాల కంటె మించిగా ఉంది. ఖతర్ లో ఉంటున్న భారతీయులలో తెలుగు ప్రవాసీయుల సంఖ్యాబలంగా అంతంత మాత్రమే ఉన్నా తెలుగు పండుగల నిర్వహణలో తమదైన శైలీలో మోత్తం గల్ఫ్ లో తమకంటూ ఒక ప్రత్యెకతను కల్గి ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల విభజనంతరం ఇక్కడ సంఘాలు కూడ వేర్వేరుగా ఏర్పడగా అందులో తెలంగాణ ప్రజా సమితి ఒకటి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1969లో ఏర్పడ్డ తెలంగాణ ప్రజా సమితి తన ప్రభావం కోల్పోయినా అదే పేరుతో ఖతర్ లో ఏర్పడ్డ తెలంగాణ ప్రవాసీయుల సంఘం మాత్రం అనతికాలంలో ఎడారి నాట తనకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు సంతరించుకోంది. ఒకప్పుడు తెలంగాణ బోనం ఎత్తడానికి సిగ్గుపడె పరిస్ధితి నుండి సగర్వంగా బోనమెత్తి ధూంధాం చేసే స్ధాయికు తెలంగాణ ప్రవాసీయులను తీసుకోవచ్చింది. వేడుకల నిర్వహణలో ఇతరుల తరహా అనుభవం లేకున్నా దృఢసంకల్పం ఉంటె చాలు అంటూ చేపట్టె ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది.

ప్రాంతీయ వాదం ఏదైతెనేమి, పండుగలు మాత్రం ఒక్కటె కదా, అందునా తెలుగు పంచాంగం ప్రమాణికంగా ఉండె ఉగాది ఉత్సవాలను తెలంగాణ ప్రజా సమితి అంగరంగ వైభవంగా నిర్వహించింది. వేప పువ్వూ, మామిడికాయ, బెల్లం మిశ్రమం ఉగాదిలో ఆచారం, దానికి తగినట్లుగా అన్ని ప్రాంతాలతో వారితో కలిసి శనివారం దోహాలో శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను నిర్వహించగా పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయుల కుటుంబాలు ఇందులో పాల్గోన్నాయి. హైద్రాబాద్ నుండి ప్రత్యెకంగా వచ్చిన చలనచిత్ర, టివి రంగ కళాకారులు తమ మధుర సంగీతంతో సభికులను అలరింపజేసారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమ వేదిక చివరి క్షణంలో మారినా పూర్తిగా పండుగ వాతవారణంలో కొనసాగింది.

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన స్ధానిక వ్యాపారవేత్త బుయ్యని ప్రవీణ్ కుమార్ ను తెలంగా ప్రజా సమితి ప్రత్యెకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మానించింది.