Politics

ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన అపకీర్తి జగన్మోహన్ రెడ్డిదే.

ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన అపకీర్తి జగన్మోహన్ రెడ్డిదే.

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసైనా జగన్ సర్కార్ సిగ్గు తెచ్చుకోవాలి.

తెలంగాణలో నూతన సచివాలయాన్ని అధునాతన భవనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకభట 4 ఏళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది.

మాట్లాడితే మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చింది.

తెలంగాణలో నిర్మాణాలు జరుగుతుంటే, ఏపీలో కూల్చివేతల పాలన సాగడం దురదృష్టకరం.

ఏపీలో అమరావతిలో భూములు, ఇతర వనరులున్నా రాజధాని నిర్మించలేకపోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోంది.
– రామకృష్ణ.