NRI-NRT

కూరశావులో తొలి తెలుగు వైద్యుడిగా డా.అల్లూరి వాసు

కూరశావులో తొలి తెలుగు వైద్యుడిగా డా.అల్లూరి వాసు

నెదెర్ల్యాండ్ దీవుల్లోని కూరాశవు దేశంలో హృద్రోగ వైద్య సేవలందించే తొలి తెలుగు వైద్యుడిగా డా. అల్లూరి వాసు అక్కడి స్థానిక ప్రభుత్వాల నుండి అధికారిక గుర్తింపు సంపాదించారు. ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కూరశావులో ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయం St.Martinusలో వాసు ప్రొఫెసర్‌గా, విశ్వవిద్యాలయ అధ్యాపకుల కమిటీకి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. బెజవాడ పిన్నమనేని సిద్ధార్థ పూర్వ విద్యార్థి అయిన వాసుకు UK నుండి కార్డియాలజీలో డిప్లోమా పట్టా ఉంది. ఆయన గుర్తింపు పట్ల ప్రవాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.