Politics

సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న నడ్డా

సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న నడ్డా

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శంషాబాద్ హోటల్‌కు నడ్డా చేరుకొని అక్కడ బిజెపి కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పుల అనంతరం కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేతల్లో విభేదాలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.