Politics

డిసెంబర్‌లోనే లోక్ సభ ఎన్నికలుండొచ్చు: మమతా బెనర్జీ

డిసెంబర్‌లోనే లోక్ సభ ఎన్నికలుండొచ్చు: మమతా బెనర్జీ

లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సోమవారం టిఎంసి యువజన విభాగం వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ లో లోక్ సభ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రచారం కోసం ఇప్పటికే బీజేపీ హెలికాప్టర్లను బుక్ చేసుకుందని పేర్కొన్నారు. మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనే అవుతుందని విమర్శించారు.పశ్చిమబెంగాలలో సిపిఎం పాలనకు ముగింపు పలికామని, లోక్ సభ ఎన్నికలలో బిజెపిని తప్పకుండా ఓడిస్తామని అన్నారు. ఇప్పటికే అన్ని వర్గాలలో చీలిక తెచ్చే ప్రయత్నం బిజెపి చేసిందన్నారు. ఇక జాదవ్ పూర్ యూనివర్సిటీ ఘటనపై స్పందిస్తూ.. గోలీమార్ అనే నినాదాలు చేసిన బిజెపి, ఏబీవీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. వర్సిటీలో ఈ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.