Politics

సీఈసీకి చంద్రబాబు ఏపీలో దొంగ ఓట్లపై ఫిర్యాదు

సీఈసీకి చంద్రబాబు ఏపీలో దొంగ ఓట్లపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దిల్లీ వెళ్లిన ఆయన సీఈసీని కలిశారు. ప్రధానంగా తెదేపా సహా ఇతర ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన ఉదంతాలను ఎన్నికల సంఘానికి చంద్రబాబు వివరించారు. వాలంటీర్ల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.అధికార వైకాపాకు అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేరుస్తున్నారని, ఒకే ఇంటి చిరునామాతో వందల ఓట్లు చేర్పించారని వివరించారు. ఈ మేరకు ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచారం సేకరించిన తెదేపా.. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి సీఈసీకి దృష్టికి తీసుకెళ్లింది. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. తెదేపా ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని.. అధికారుల తీరుపైనా సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.