Devotional

శ్రీవారి సన్నధిలో తగ్గిన భక్తుల రద్దీ

శ్రీవారి సన్నధిలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల వెళ్లేవారికి అలర్ట్‌.. తిరుమల శ్రీవారి సన్నధిలో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న అంటే 20-10-2023 రోజున తక్కువగానే తిరుమల శ్రీవారి స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,821 మందిగా నమోదు అయింది. ఇక తిరుమల శ్రీవారికి స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,098 మందిగా నమోదు అయింది.అలాగే.. నిన్న తిరుమల శ్రీవారి స్వామివారి హుండీ ఆదాయం 2.27 కోట్లు గా నమోదు కావడం విశేషం. ఇక టికెట్ లేని సర్వదర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు తిరుమల శ్రీవారి భక్తులు. అటు టికెట్ లేని సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బతుకమ్మ మరియు దసరా సెలవులు కావడంతో.. ఇతర ప్రదేశాలకు జనాలు వెళుతున్నారు. దీంతో.. తిరుమల శ్రీవారి సన్నధిలో భక్తుల రద్దీ తగ్గింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z