మహేశ్బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో సిద్ధమవుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి కథానాయికలు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ ప్రోమోలో మహేశ్ – శ్రీలీల మాస్ డ్యాన్స్ చూడొచ్చు. ఈ పూర్తి పాటను శనివారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –