Movies

‘కెప్టెన్‌ మిల్లర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్న ధనుష్‌

‘కెప్టెన్‌ మిల్లర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్న ధనుష్‌

‘కెప్టెన్‌ మిల్లర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ధనుష్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించారు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మాతలు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. శివ రాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఘోర హర..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ధనుష్‌, శివ రాజ్‌కుమార్‌పై చిత్రీకరించిన పాటిది. దీనికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చగా.. రాకేందు మౌళి సాహిత్యమందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ‘‘1930-40ల మధ్య కాలంలో జరిగే యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రమిది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z