హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కేకే నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో కార్యకర్తలు సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలోనే పిక్ పాకెటర్స్ తమ చేతికి పని చెప్పారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తల జేబుల నుంచి డబ్బులను దొంగలించారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ 1, నిర్మల్ 3, ఖాగజ్నగర్ 6 కార్యకర్తలు సంబంధించిన ఎమౌంట్ కొట్టేశారని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ఏకంగా కేటీఆర్ పీఎస్ పాకెట్ కొట్టేశారని తెలుస్తోంది. దీంతో కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు.
👉 – Please join our whatsapp channel here –