తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం లండన్ పర్యటన కొనసాగుతోంది. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
హైదరాబాద్లో మూసీ, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూసీకి పునర్వైభవం వస్తే నది, చెరువులతో హైదరాబాద్ మరింత శక్తిమంతమవుతుందని సీఎం వివరించారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తిగా సహకరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –