24 న పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యంగా పులివెందుల లో ఆర్టీసీ బస్టాండు, డిపో, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు.
రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి వైఎస్. జగన్ చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపుల పాయ కు చేరుకుంటారు.
రేపు రాత్రి ఇడుపుల పాయ లోనే బస చేస్తారు.
24 న ఉదయం 9.10 గంటలకు వైయస్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
ఆ తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన బోతున్నారు.
మధ్యాహ్నం పులివెందుల భాకరా పురం చేరుకుంటారు.
2.20 గంటలకు ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపో లకు శంకుస్థాపన చేస్తారు.
3.10 గంటల ఇమ్రా ఏపీ కి, ఆ తర్వాత అపాచ్ లెదర్ డెవలప్ మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం ఇడుపుల పాయ కు చేరుకుంటారు.
25 వ తేదీన క్రిస్మస్ సందర్భంగా పులివెందుల లోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 11.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజమండ్రి కి బయలుదేరి వెళ్తారు.