వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల్లో భుజం, వెన్ను, మెడ నొప్పులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ‘కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన తర్వాత సిక్ స్కాప్యులా సిండ్రోమ్(భుజం నొప్పి) కేసులు 20-25శాతం పెరిగాయి. 30-45 ఏండ్ల మధ్య వయసు వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది’ అని బెంగళూరులోని ఫోర్టిస్ దవాఖాన వైద్యుడు రఘునాగరాజ్ తెలిపారు. పనిచేసేప్పుడు కూర్చోవడానికి ఇండ్లలో సరైన కుర్చీలు లేకపోవడం, గంటల తరబడి కండరాలపై ఒత్తిడి పెరగడంతోనే ఈ ఇబ్బందులని చెప్పారు.
వర్క్ ఫ్రం హోం కారణంగా పెరిగిన భుజం నొప్పులు
Related tags :