Business

రూ.399కు బ‌దులుగా రూ.499

Airtel Increases Prices Of Its Postpaid Plans By 100Rupees

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల‌లో పలు మార్పులు చేసింది. ఇక‌పై రూ.399 కు బ‌దులుగా వినియోగ‌దారుల‌కు రూ.499 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో క‌స్ట‌మ‌ర్ల‌కు 75 జీబీ డేటా, అన్‌లిమిడెట్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కింద మూడు నెల‌ల నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్, జీ5 స‌బ్‌స్క్రిప్ష‌న్‌, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, హ్యాండ్ ప్రొటెక్ష‌న్ స‌ర్వీస్‌లు ల‌భిస్తాయి. ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, పైన చెప్పిన ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవ‌లు అన్నీ ల‌భిస్తాయి. అలాగే రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 150 జీబీ డేటా, రూ.1599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లు వ‌స్తాయి. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ ల‌భిస్తాయి.