Politics

మా బంధం అజరామరం

KVP Says His Relation With Jagan Is Never Ending-TNILIVE political news

జగన్ తో తన అనుబంధం తెగిపోయేది కాదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరొందిన కేవీపీ.. జగన్ తనకు మేనల్లుడులాంటి వాడని తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు. యూపీఏలో జగన్ ను కలపాలని తనని ఆదిస్థానం కోరలేదని ఒకవేళ ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే నిర్వర్తించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. జగన్ కు సీట్లు పెరిగితే తమతో కలుపుకోవాలని యూపీఏ చూస్తుందన్న విషయం కూడా తనకు తెలీయదని చెప్పారు. ఇక ప్రస్తుతం తాను జగన్ తో ఎందుకు లేనన్న విషయాన్నీ ఓపెన్ గా చెప్పలేనని దాని గురించి చర్చించే సమయం ఇది కాదని వివరించారు.