Agriculture

తెలంగాణాలో రైతులకు ₹5వేలు అదనంగా పెటుబడి

Telangana Rythubandhu Scheme Gets A New Facelift

రైతుబంధు పథకం కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ పథకం కింద ఎకరానికి రూ.5వేలు చొప్పున పెట్టుబడి సాయం పెంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్రస్థాయి పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో రైతుబంధు సాయం పెంచుతున్నట్టు తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ కానుంది. రైతుబంధు వద్దనుకునేవారు గివ్‌ ఇట్‌ అప్‌ ద్వారా వెనక్కి ఇచ్చే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.