Politics

నా ఆశయాలు చూశారు-ఇప్పుడు రాజకీయం చూపిస్తా

Pawan Kalyan Ready To Present His Political Skills

ఇప్పటివరకూ తన ఆశయాలను చూశారని, ఇకపై తన రాజకీయం చూస్తారని అంటున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. తాజాగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. ‘‘ఆశయాలతో వస్తే నిన్నే ఓడించారు’ అని కొందరు నాతో అన్నారు. భీమవరంలో నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారట. ఒక్క వీరవాసరం మండలానికి రూ.30కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. నేను ఎవరిని నుంచి ఏమీ ఆశించలేదు. మీరు చప్పట్లు కొట్టినా, మెచ్చుకున్నా, తిట్టినా నా పని నేను చేసుకుంటూ వెళ్లా. నిజమైన రాజకీయం, వ్యూహాలు, ఎత్తుగడలు వేయలేక కాదు. చేతకాక కాదు. ఈసారి నా వ్యూహాలు చాలా బలంగా ఉంటాయి. ఆశయాలతో ఉండే పవన్‌కల్యాణ్‌ను మీకు చూపించానంతే. ఇక నుంచి మార్పు వచ్చే వరకూ ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉంటా. శ్రీకాకుళంలో వలసలు ఆగే వరకూ వేస్తా. జర్మనీ నుంచి నాకోసం 500మంది వచ్చారు. అలాంటి వాళ్ల కోసం నేను రాజకీయాల్లో ఉండిపోతా. ఇప్పటివరకూ నా ఆశయాలు చూశారు. ఇకపై నా రాజకీయాలు చూస్తారు. నేను స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదు. సమాజ శ్రేయస్సు కోసం వచ్చా’’ అని అన్నారు.