Movies

భీష్మ

Nithin Rashmika Pair For A New Movie Titled Bheeshma

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన్న కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 20 నుంచి మొదలవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నితిన్‌ పాత్రలో ప్రతి కుర్రాడు తనని తాను చూసుకొంటాడు. రష్మిక పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. రొమాంటిక్‌గా సాగే వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్‌.రాధాకృష్ణతో పాటు చిత్రబృందం పాల్గొంది. ఈ చిత్రంలో నరేష్‌, సంపత్‌, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్‌, కల్యాణి నటరాజన్‌, రాజశ్రీ నాయర్‌ తదితరులు నటిస్తున్నారు.