Devotional

అయ్యప్పకు PayTM ద్వారా కానుకలు ఇవ్వొచ్చు

Sabarimala Temple To Accept Digital Donations

కానుకల సమర్పణకు శబరిమల ఆలయంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఇకపై డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా భక్తులు కానుకలు చెల్లించవచ్చు. అందుకోసం తగిన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసింది. సౌత్‌ ఇండియన్ బ్యాంకుతో కలిసి ఆలయ దేవస్థానం బోర్డు ఈ ఇ-హుండీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఆలయంలో నాలుగు చోట్ల స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యం ఆలయం తెరిచి ఉన్నంత వరకే ఉంటుందని తెలిపారు.