NRI-NRT

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయిన “ఆటా” వేడుకలు

ATA Begins 2019 Vedukalu With Charity In Nirmal Dt.-తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయిన

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న “ఆటా వేడుకలు” బుధవారం నాడు తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దిలావర్‌పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, విద్యా సామాగ్రి అందించి, పాఠశాలలోని తరగతులకు బెంచీలను ఆటా బృందం బహుకరించింది. అనంతరం స్థానికంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి పలువురు పేద ప్రజలకు వైద్య సాయాన్ని అందించారు. గురువారం నాడు ఇదే జిల్లాలోని జామ్ గ్రామంలో 1000మంది పేద గ్రామస్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేశారు. ఈ వైద్య శిబిరంలో తెలంగాణా మంత్రి ఐ.కె.రెడ్డి పాల్గొన్నారు. రెండు కార్యక్రమాల్లో ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, వేడుకల్ అధ్యక్షుడు భువనేశ్ బూజాల, ఆటా ప్రతినిధులు బొమ్మినేని మధు, చల్లా జయంత్, బొద్దిరెడ్డి అనీల్, పిస్కె వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో 29 వరకు జరుగుతాయి.