ఒకప్పుడు తమిళంలో నటించి.. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి బిజీగా తారగా మారిన యామి గౌతమ్ మళ్లీ కోలీవుడ్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా అజిత్ చిత్రంలో ఆయనకు జోడీగా యామి నటిస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. ‘తమిళ్ సెల్వనుం తనియార్ అంజలుం’ చిత్రంలో జైకి జోడీగా నటించింది యామి. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిన కొన్ని సంవత్సరాల తర్వాతే విడుదలైంది. ఇందులో ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయితే అప్పటికే బాలీవుడ్కు రెక్కలు కట్టుకుని వెళ్లిపోయింది. అక్కడ ‘సర్కార్ 3’, ‘యాక్షన్ జాక్షన్’ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మళ్లీ కోలీవుడ్పై కన్నేసింది. తాజాగా వినోద్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న ‘వలిమై’ చిత్రంలోనూ నటిస్తోంది. అయితే కథానాయికగా నజ్రియా, ప్రియాంకా చోప్రా పేర్లు ఇటీవల వినిపించాయి. కానీ యామి గౌతమ్ను ఎంపిక చేసుకున్నట్లు కోడంబాక్కం వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
అజిత్ పక్కన యామి
Related tags :