ట్రంప్ భారత పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి చివరి వారంలో ట్రంప్ భారత్కు రానున్నారని, మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారని సమాచారం.
తేదీలు ఖరారు చేసే పనిలో ఇరు దేశాల అధికారులు నిమగ్నమై ఉన్నారు.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ట్రంప్ పర్యటన సందర్భంగా ఓ భారీ కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
అమెరికాలో గత ఏడాది జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయని, ‘హౌడీ ట్రంప్’గా దీనికి నామకరణం చేయొచ్చని ఈ విషయాలతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ఈ కార్యక్రమానికి వేదిక కావచ్చిన సమాచారం. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వినికిడి.
మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ట్రంప్..దేశరాజధానితో పాటు మరో ప్రధాన నగరాన్ని కూడా సందర్శిస్తారని సమాచారం.