కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జ్వరం, శ్వాస సంబంధ సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. సోనియా గాంధీకి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే చేరారని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ సాయంత్రం 7గంటల సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరగా.. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.
ఆసుపత్రిలో అధినేత్రి
Related tags :