Politics

ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ

AP Minister Vanitha Signature Forged

రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఏపీ మంత్రి తానేటి వనిత పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో అసైన్డ్‌ భూమి పొందటం కోసం తన లెటర్‌ ప్యాడ్‌పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేసి సిఫార్సు లేఖ వలే కలెక్టర్‌కు పంపినట్టు పేర్కొన్నారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె కోరారు.