కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దినట్టు తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 20న ఈ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘10లక్షల పీపీఈ కిట్లు, 10లక్షల ఎన్95 మాస్కులు, ఆస్పత్రుల్లో గాగుల్స్, వైద్య పరికరాలు సమకూర్చుకుంటున్నాం. వైద్య సిబ్బందితో పాటు రక్షణ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేస్తున్నాం’’ అని వివరించారు.
20న గచ్చిబౌలి ఆసుపత్రి ప్రారంభం
![Etela Announces Gachibowli Hospital Opens On April 20 Etela Announces Gachibowli Hospital Opens On April 20](https://i.imgur.com/uhdFIWf.png)
Related tags :