Devotional

మే6 నుంచి పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

మే6 నుంచి పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 6 నుంచి 8వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 5న అంకురార్పణ నిర్వ‌హిస్తారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 6 నుంచి 8వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 5 నుంచి 8వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 6న అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శాభిషేకం, మే 7న తిరుప్పావ‌డ‌సేవ‌, మే 8న ల‌క్ష్మీపూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.