Devotional

కేదార్‌నాథ్ తెరిచారు

Kedarnath Temple Re-opens After 6 Months

ఆరునెలల పాటు మూసివున్న కేథార్‌నాథ్ ఆల‌య త‌లుపులు తెరుచుకున్నాయి. మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులను వేద పండితులు తెరిచారు. ఇవాళ ఉదయం సరిగ్గా 6 గంటల 10 నిముషాలకు ఆలయం తలుపులు ఓపెన్ చేశారు. అంతకుముందు పవిత్ర పంచముఖి డోలి యాత్ర జరిగింది. ఉత్తరాఖండ్ లోని గడ్డస్థల్ వద్ద ప్రారంభమైన యాత్ర .. గౌరీకుండ్ వరకు వాహనంలో సాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కాలినడకన… కేదారనాథున్ని డోలి యాత్ర ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు. ఏటా దాదాపు కుమావో బెటాలియన్ ఆర్మీ నేతృత్వంలో యాత్ర జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై.. శివనామస్మరణతో గిరులను మారుమోగిస్తారు.