2010 గ్వాలియర్లో దక్షిణాఫ్రికాతో తలపడిన వన్డేలో టీమ్ఇండియా బ్యాట్స్మన్ సచిన్ తెందూల్కర్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి డబుల్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సచిన్ తర్వాత రోహిత్శర్మ, వీరేందర్ సెహ్వాగ్, క్రిస్గేల్, మార్టిన్ గప్తిల్ తదితరులు సైతం ఈ ఘనతను అందుకున్నారు. అయితే, దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్లో సచిన్ 190 పరుగులకు దగ్గరగా ఉండగా, తాను ఎల్బీడబ్ల్యూ చేశానని స్టెయిన్ తాజాగా జేమ్స్ ఆండర్సన్తో అన్నాడు. స్కైస్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ రికార్డుపై అబద్ధాలు చెప్పాడు. ‘వన్డేల్లో తెందూల్కర్ తొలి ద్విశతకం సాధించాడు. అది కూడా గ్వాలియర్లో మాపైనే. నాకు బాగా గుర్తు.. అతను 190లో ఉండగా, నేను ఎల్బీడబ్ల్యూ చేశాను. అప్పుడు ఇయాన్ గౌల్డ్ అంపైర్గా ఉండి నాటౌటిచ్చాడు. తర్వాత ఎందుకలా చేశావన్నట్లు నేను అంపైర్ వైపు తిరిగి చూశాను. ప్రేక్షకులను చూసి అతను భయపడినట్లు అనిపించింది. ‘‘ఒకవేళ నేను ఔటిస్తే స్టేడియం నుంచి హోటల్కు వెళ్లనేమో!’’ అనేలా కనిపించాడు’ అని స్టెయిన్ గొప్పలకు పోయాడు.
అంపైర్ భయపడ్డాడు
Related tags :