Politics

నేడు రాజీవ్ వర్ధంతి….తండ్రితో తనయ

Priyanka Gandhi Recalls Her Memories With Dad Rajeev

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. ‘నాన్నతో నా చివరి ఫోటో’ అంటూ తండ్రితో దిగిన ఫోటోను ట్వీట్‌‌ చేశారు ప్రియాంక గాంధీ. తన 19వ ఏట రాజీవ్‌ గాంధీతో కలిసి ఈ ఫోటో దిగారు ప్రియాంక. ‘మీ మీద దయ లేని వారి పట్ల కూడా మీరు దయతో ఉండండి. జీవితం అన్యాయంగా ఉంటుందని మీరు ఊహించుకున్నప్పటికి.. అది చాలా న్యాయంగానే ఉంటుంది. కటిక చీకటిలో, ఉరములు మెరుపులలో కూడా మీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండండి. ఎంతటి కష్టం అయినా రానివ్వండి.. మీ హృదయాన్ని మాత్రం ప్రేమతో బలంగా తయారు చేసుకొండి. నా తండ్రి జీవితం నాకిచ్చిన బహుమతులు ఇవే’ అంటూ ట్వీట్‌ చేశారు ప్రియాంక గాంధీ.