WorldWonders

బతికున్న భార్యను పూడ్చిన నెల్లూరు భర్త

Nellore husband cremates wife who was alive

?నెల్లూరుజిల్లాలో దారుణం – భార్యను సజీవంగా పూడ్చిన కర్కోటక భర్త

మద్యం మత్తులో భార్యను దారుణంగా కొట్టి సజీవంగా పూడ్చిన దుర్మార్గపు భర్త

? రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన

? రంగంలోకి పోలీసులు

⬛ జిల్లాలో సంచలనంగా మారిన ఘటన

మద్యం మత్తులో మహిళను కొట్టి సజీవంగా పూడ్చిపెట్టిన దారుణమైన సంఘటన నెల్లూరుజిల్లాలో సోమవారం వెలుగుచూసింది. కొడవలూరు మండలం, గండవరం పంచాయితీలోని గొట్లపాళెంలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం మృతిరాలి కుమార్తె ద్వారా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లో కెళ్తే… పొన్నూరు సుభాషిణి అనే మహిళ భర్తను వదిలి బుడబుక్కల సాములు అనే వ్యక్తితో గొట్ల పాళెంలో సహజీవనం చేస్తుంది. రొయ్యల సాగు చేసే చెరువు గట్టుపై వారు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి వద్దే మద్యం సేవించారు. కొద్ది సేపటికే ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలో బుడబుక్కల సాములు కర్రతో సుభాషిణీని బలంగా కొట్టాడు. అసలే మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ కర్ర దెబ్బకు స్క్రృహ తప్పి అక్కడే పడిపోయింది. దీంతో చనిపోయిందని భావించిన సాములు ఆమెను సమీపంలోని చెట్ల పొదల మధ్య గుంత తీసి సజీవంగా పూడ్చివేశాడు. జరిగిన దానినంతా కళ్లారా చూసిన సుభాషిణీ ఏడేళ్ల కుమార్తెను అతను బెదిరింది అక్కడి నుండి పరారయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన విషయాన్ని ఆ బాలిక పెద్దలకు చెప్పడంతో ఈ ఘటన వెలుగుచూసింది. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న కొడవలూరు సిఐ శ్రీనివాసరావు, తహసీల్ధార్ లాజరస్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూడ్చిన ప్రదేశం వద్ద తవ్వి మృతి చెందిన సుభాషిణీ దేహాన్ని బయటకు తీశారు. శవపంచనామా నిర్వహించి శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో పరీక్షించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నెల్లూరు జిజిహెచ్ కు తరలించారు. సుభాషిణీని సజీవంగా పూడ్చిన సాములు కోసం పోలీసులు గాలిస్తున్నారు.