Politics

రంగుల ఖర్చులు వైకాపా భరించాలి

Chandrababu demands compensation of wasted colors from YSRCP leaders

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులకు అయిన ఖర్చును వైకాపా నేతల నుంచే రాబట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు చేస్తుందనేదానికి రంగుల ఉదంతమే నిదర్శనమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కారం, అహంభావం, మూర్ఖత్వానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు ఆక్షేపించారు. తాము చేసిందే ఒప్పు అనేలా కోర్టుల్లో వాదనలు చేయడం, తప్పుడు జీవోలు ఇవ్వడం, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదని ఆయన దుయ్యబట్టారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం వంద తప్పులు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.