Sports

మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో శ్రీలంక ఆటగాళ్లు

Sri Lanka Players Facing ICC Enquiry

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నారని ఆ దేశ క్రీడాశాఖా మంత్రి డుల్లాస్‌ అలహపెరుమ బుధవారం వెల్లడించారు. అయితే, ఆ ముగ్గురు ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు. క్రీడల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వం దిగజారిపోయాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. కాగా, ఈ విషయంపై స్పందించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు.. ఐసీసీ అవినీతి నిరోధక అధికారుల విచారణలో ప్రస్తుత క్రికెటర్లు లేరని ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. ‘క్రీడాశాఖా మంత్రి పేర్కొన్న విధంగా.. ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నది శ్రీలంక మాజీ ఆటగాళ్లని మేం కచ్చితంగా నమ్ముతున్నాం. ప్రస్తుత ఆటగాళ్లు కాదు’ అని పేర్కొంది.