NRI-NRT

పీవీకి భారతరత్న ఇవ్వాలి-లండన్ ఎన్నారై తెరాస తీర్మానం

TNILIVE London NRI News || NRI TRS London TAUK Celebrates PV Birthday

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి కార్యక్రమాన్ని లండన్‌లో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే మరియు టాక్ ప్రతినిధులు నిర్వహించారు. ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అనీల్ కూర్మాచలం, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షురాలు పవిత్ర కంది, టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం తదితరులు పీవీ సేవలను స్మరిస్తూ ప్రసంగించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. టాక్ ప్రతినిధులు అశోక్ గౌడ్ దూసరి, సతీష్ గొట్టెముక్కల, సురేష్ బుడగం, జాహ్నవి దూసరి తదితరులు పాల్గొన్నారు.