Politics

కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మోడీ అమరావతిపై స్పందిస్తారు.

కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మోడీ అమరావతిపై స్పందిస్తారు.

ఏపీ రాజధాని అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని, కేంద్రం స్పందించే సమయం ఇంకా రాలేదని, అమరావతిపై కేంద్రం సరైన సమయంలో స్పదిస్తుందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వ్యవహారంలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలిసానన్నారు.

వ్యక్తులు వేరు.. వ్యవస్థలు వేరన్న విషయం వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. 

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయం ఆపార్టీ అంతర్గత వ్యవహారమని సుజనాచౌదరి అన్నారు.

మూర్ఖత్వంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు.

పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వకపోవటం బాధాకరమన్నారు.

పీవీ గౌరవార్థం పోస్టల్ స్టాంపును రిలీజ్ చేస్తున్న కేంద్రానికి ధన్యవాదములు చెప్పారు.

పీవీ, వాజపేయి, మోదీలు భారతదేశ చరిత్రలో గొప్ప ప్రధానులని కొనియాడారు.

పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వలనే ఇవాళ దేశం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు.

మోదీ ఇచ్చిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేద వర్గాలకు అండగా ఉందని, మోదీ నాయకత్వం వలనే కరోనాను కట్టడి చేయగల్గుతున్నామని అన్నారు.