Devotional

నెలరోజుల్లో రెండున్నర లక్షల మంది దర్శనాలు

నెలరోజుల్లో రెండున్నర లక్షల మంది దర్శనాలు

కరోనా లాక్‌డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించి నేటికి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో శ్రీవారిని 2 లక్షల 49 వేల 369 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 66708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నెల రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రూ.13.93 కోట్ల ఆదాయం లభించింది.