Business

ఏపీలో రిజిస్ట్రేషన్ అక్రమాలకు ముగింపు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగానే వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు.

తొలుత పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, ఇది సక్సెస్ అయితే త్వరలోనే క్రమక్రమంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ సేవలను విస్తరించడానికి రంగం సిద్ధం చేస్తోంది.