Politics

జగన్ నాలుగు కమిటీలు ఈ పని చేస్తాయి

జగన్ నాలుగు కమిటీలు ఈ పని చేస్తాయి

జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కమిటీ-1 ,
జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి

కమిటీ-2 ,
నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి,

కమిటీ-3,
ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి,

కమిటీ-4,
ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

జిల్లాస్థాయి కమిటీలు ,
జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకానుంది. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సబ్ కమిటీలు,
జిల్లా స్థాయి కమిటీలు, సచివాలయ బాధ్యతలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.