WorldWonders

హైదరాబాద్ వజ్రాల రికార్డు దాటిన యూపీ ఉంగరం

ఉత్తర్​ప్రదేశ్​ మేరట్​కు చెందిన రెనానీ జువెల్స్ అరుదైన ఘనత సాధించింది. 12,638 వజ్రాలతో ఓ ఉంగరాన్ని తయారుచేసి గిన్నిస్​ బుక్​లో చోటు దక్కించుకుంది.సాధారణంగా ఓ ఉంగరంలో ఎన్ని వజ్రాలు ఉంటాయి? ఒకటే కదా.. అనుకుంటున్నారా? కాదు.. 12,638. అవును మీరు చదివింది నిజమే. 12,638 వజ్రాలతో తయారు చేసిన ఓ ఉంగరం గిన్నిస్​ ​ రికార్డులకెక్కింది. ఉత్తర్​ప్రదేశ్​ మేరట్​కు చెందిన రెనానీ జువెల్స్​ సంస్థ ఈ ఉంగరాన్ని రూపొందించింది.
** వజ్రాలతో రూపకల్పనప్రత్యేకతలు..
*ఉంగరం బరువు: 165
*గ్రాములుతయారీదారు: రెనానీ జువెల్స్
*​ఉంగరం పేరు: మేరీ గోల్డ్​, ద రింగ్​ ఆఫ్​ ప్రాస్పరిటీ 38.08 క్యారెట్ల మేలిమి వజ్రాలతో ఉంగరం తయారీ
****మునుపటి రికార్డ్..
హైదరాబాద్​కు చెందిన హాల్​మార్క్​ జువెలర్స్​ 7,801 వజ్రాలతో తయారు చేసిన ఉంగరం పేరిట ఈ ఘనత ఉండేది. అత్యధిక వజ్రాల ఉంగరంగా ఆ రికార్డ్​ను రెనానీ జువెల్స్​ అధిగమించింది.గిన్నిస్​ బుక్​ రికార్డ్​ సాధించడం ఆనందంగా ఉందని రెనానీ జువెల్స్​ అధిపతి హర్షిత్​ బన్సాల్ తెలిపారు. ఈ ఉంగరం చేయడానికి దాదాపు రెండు ఏళ్లు పట్టిందని చెప్పారు.