Business

రైల్వేస్టేషన్లు మూసివేస్తున్న ద.మ.రైల్వే

రైల్వేస్టేషన్లు మూసివేస్తున్న ద.మ.రైల్వే

దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో 31 రైల్వేస్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సరైన ఆదాయం, జనం రద్దీ లేని కారణంగా ఫిబ్రవరి 1 నుంచి 29 రైల్వేస్టేషన్లు మూసివేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాగా ఏప్రిల్‌ 1 నుంచి మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 16‌, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్‌లో 1, గుంటూరులో 4, హైదరాబాద్‌లో 7 స్టేషన్లు మూతపడనున్నాయి.