తానా క్యాపిటల్ రీజియన్(డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా) ప్రాంతీయ ప్రతినిధి ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అయిన బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతీయ ప్రతినిధిగా వుయ్యూరు శ్రీనివాస్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మేరీల్యాండ్కు చెందిన కూకట్ల శ్రీనివాస్ తన నామినేషన్ను బుధవారం నాడు ఉపసంహరించుకుని వుయ్యూరు శ్రీనివాస్ ఎన్నికకు అడ్డంకి తొలగించారు. అనంతరం ఇరువురు శ్రీనివాస్లు మాట్లాడుతూ #TANA4Change నినాదానికి చేయూతగా నిరంజన్ శృంగవరపు ప్యానెల్కు తమ పూర్తి మద్దతును ఇస్తామని, రానున్న రెండేళ్లలో ఇంటింటికీ తానాను క్యాపిటల్ రీజియన్లో విస్తరిస్తామని అన్నారు. అయితే అధ్యక్ష పదవికి బరిలో ఉన్న మరో అభ్యర్థి నరేన్ కొడాలి నివాసం ఉండేది క్యాపిటల్ రీజియనే కావడం గమనార్హం. వుయ్యూరు శ్రీనివాస్ ఏకగ్రీవం కావడం, ఆయన నిరంజన్ ప్యానెల్కు మద్దతు తెలపడం నరేన్ వర్గానికి మరో ఓటమిగా తానా సభ్యులు భావిస్తున్నారు.
Flash: నరేన్ కోటలో నిరంజన్ పాగా
Related tags :