Movies

పాత్రికేయురాలిగా రష్మిక

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సి 15’వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఆమె ఇందులో జర్నలిస్టుగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శంకర్ చెప్పిన కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించిందట. అయితే అధికారికంగా చిత్రబృందం ఎక్కడా ప్రకటించలేదు. సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.