Movies

దృశ్యం కాంబో మరోసారి

విలక్షణ నటుడు మోహన్‌లాల్‌- దర్శకుడు జీతూ జోసెఫ్‌ కలిస్తే వచ్చే సస్పెన్స్‌ థిల్లర్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో ‘దృశ్యం’తో పాటు 2021లో వచ్చిన ‘దృశ్యం-2’ ఈ రెండూ ప్రేక్షకులపై చెరగని ముద్రవేశాయి. అంతేకాదు.. ‘దృశ్యం’తో పాటు దాన్ని సీక్వెల్‌ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రూపొందించారు. ఇంతలా అలరించిన ఈ జోడి మళ్లీ అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇదే విషయాన్ని నటుడు మోహన్‌లాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘‘నా తదుపరి చిత్రం 12th మ్యాన్‌ జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’’ అని ప్రకటించారు. చీకటిలో బంగ్లా ముందు మోహన్‌లాల్‌ నిలబడిన చిత్ర పోస్టర్‌ అంచనాలను పెంచుతోంది. మరోవైపు జీతూ జోసెఫ్‌ తెలుగులో వెంకటేశ్‌తో ‘దృశ్యం2’ను రీమేక్‌ చేసేశారు. ప్రస్తుతం తమిళ నటుడు కమల్‌హాసన్‌తో అదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.